తిమ్మాపూర్: రేణికుంట పాల ఉత్పత్తిదారుల సంఘ సభ్యుడు రాగుల రాజేందర్ ఇటీవల మృతిచెందగా రైతు భరోసా పథకం కింద మంజూరైన రూ.50 వేల చెక్కును మృతుడి తల్లీ రాగుల హన్మవ్వకు గురువారం కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజర్ సుధాకర్ , మరియు రూట్ సూపర్వైజర్ మల్లారెడ్డి, రేణికుంట పాలకేంద్రం చైర్మన్ తమ్మనవేని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, డైరెక్టర్లు గడ్డం తిరుపతి, నిమ్మనగొట్టు వెంకయ్య, సభ్యులు గొల్లపల్లి మల్లేశం గోనెల భూమయ్య, సోమ అశోక్ రాగుల చిరంజీవి బుర్ర ప్రశాంత్, పోతుగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు