నవతెలంగాణ-ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో హైలెట్ ప్రాజెక్టు పథకం కింద భూసార పరీక్షలు చేసి ఫలితాలను గురువారం జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలను సైతం లబ్ధిదారుల అందరూ ఉపయోగించుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పావని, మండల వ్యవసాయ అధికారి రజిత, తదితరులు పాల్గొన్నారు.