నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
శాతవాహన విశ్వవిద్యాలయం వెలువరించిన పీజీ కోర్సుల్లో బంగారు పతకాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో కరీంనగర్లోని శ్రీచైతన్య పీజీ కళాశాల విద్యార్థులు నలుగురికి సువర్ణ అవకాశం లభించిందని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సదాశివశర్మ తెలిపారు. కళాశాలలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రమేశ్రెడ్డి మాట్లాడారు. తమ విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాల్లో రాణిస్తూ యూనివర్సిటీ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగరవేశారన్నారు. అనంతరం పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సదాశివ శర్మ మాట్లాడుతూ.. 2012 విద్యాసంవత్సరానికి గాను ఎం.కాం కోర్సులో అత్యధిక మార్కులు సాధించిన ఎం.శారికికు, కృష్ణాబాయి కావ్య మెమోరియల్ గోల్డ్ మెడల్, శాతవాహన విశ్వవిద్యాలయం మొత్తం మహిళల విభాగంలో అత్యదిక మార్కులు సాధించినందుకు 2016 సంవత్సరానికి ఎమ్మెస్సీ గణితంలో సుమయానేషిన్కు 2017వ సంవత్సరానికి ఎమ్మెస్సీ వృక్షశాస్త్రంలో సిద్ధిఖలకు వీరయ్య, రాజయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్లు లభించాయని తెలిపారు. రసాయన శాస్త్ర అధ్యాపకురాలు ఆవుల మమతకు భౌతిక రసాయన శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ యు.జి.కృష్ణంరాజు మెమోరియల్ గోల్డ్మెడ్ల్కు ఎంపికైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్పిపాల్ బి.మల్లారెడ్డి, వైస్ప్రిన్పిపాల్స్ ఎల్.శ్రీనివాస్, జి.రాజ్కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Authorization