- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
హరీశ్ వర్మ, రజినీకాంత్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా, అరెస్ట్
నవతెలంగాణ-మరకమ్మతోట
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అప్పని హరీష్ వర్మ, శనిగారపు రజినీకాంత్లు డిమాండ్ చేశారు. నగరంలో కలెక్టరేట్ ఎదుట వారి ఆధ్వర్యంలో గురువారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో హాస్టల్ వసతి కల్పించాలని అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలిచ్చినా స్పందన కరువైందన్నారు. వసతి కోసం దరఖాస్తు పెట్టుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ, బీసీ డిప్యూటీ డైరెక్టర్ నిర్టక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దరఖాస్తు పెట్టుకుని నెల రోజులు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో శిథిలావ్యవస్థలో ఉన్న కళాశాల భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని అన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వసతులు కల్పించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. దాదాపు గంట పాటు ఈ ధర్నా కొనసాగగా సీఐ శ్రీనివాస్రావు ధర్నా వద్దకు చేరుకుని ఎస్ఎఫ్ఐ నాయకలను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం వారిని పోలీస్వ్యాన్లో పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గణేష్, రాకేష్, శ్రీకాంత్, సాగర్ అరవింద్, చందు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Authorization