- ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం - డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి నవతెలంగాణ-మంకమ్మతోట విద్యారంగ సమస్యలు పరిష్కారం కావా లంటే ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు కలసికట్టుగా ఉద్యమించాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి అన్నారు. నగరంలో ని ఆ సంఘ కార్యాలయంలో ఎజెండా అంశాల ను ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఉపాధ్యాయ విద్యా రంగానికి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వందలాది పర్యవేక్షణ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉపాధ్యా యుల ప్రమోషన్లు లేక ఖాళీగా ఉన్నాయ న్నారు. సీపీఎస్ను రద్దు చేయకపోవడం, పీఈటీ పోస్టులను ఆప్గ్రేడ్ చేయకపోవడం, ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఉపాధ్యా య సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాల న్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజమౌళి, నాయకులు పాల్గొన్నారు.