- కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి
- గుట్కా ప్యాకెట్లు పట్టివేత
- సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.60 వేల విరాళం అందజేత
నవతెలంగాణ-చొప్పదండి
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అరికట్టడానికే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు అడిషనల్ డీసీపీ, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.ఉషారాణి అన్నారు. మండలంలోని గుమ్లా పూర్ గ్రామంలో ఆదివారం కార్డెన్సెర్చ్లో భాగంగా పోలీసు బలగాలను మోహరించి గ్రామంలో వాడవాడలా విస్తృతం గా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.3 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రజలకు అందుబా టులో ఉంటున్నారా అని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచా రం అందించాలని సూచించారు. గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగితెలుసుకున్నట్టు చెప్పారు. భూ తగాదాల పట్ల గొడవల కు దారి తీసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాల న్నారు. యువతీ యువకులు క్షణికావేశానికి లోనుకాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులు పనిచేసేటట్టుగా ఉంటుందని అన్నారు. గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని గొడవలు సృష్టించుకోవద్దని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు రూ.60 వేలను విరాళంగా అందజేశారు. ఈ కార్డెన్సెర్చ్లో చొప్పదం డి, మానకొండూర్ సీఐలు రమేశ్, సంతోష్కుమార్, చిగురు మామిడి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, చొప్పదండి ఎస్ఐలు సురేందర్, వివేక్, రవి, సత్యనారాయణ, బి.చేరా లు, ఆర్ఐ ఎంటీ వో జానీ, ఆర్ఎస్ఐ లాల్, పోలీస్సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Authorization