- రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్
- కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-సిరిసిల్ల
జిల్లాలో సీజనల్ వ్యాధుల అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో శనివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 30 రోజుల ప్రత్యేక గ్రామ కార్యాచరణ కార్యక్రమంలో పారిశుధ్యంపై ప్రత్యేక దష్టిసారించి ప్రజలు డెంగ్యూ, టైపాయిడ్, మలేరియా బారిన పడకుండా జాగ్రతలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే.జోషి మాట్లాడుతూ.. వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దోమలు ప్రభలకుండా ఆంటీ లార్వా చర్యలతో పాటు అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 23 నుంచి నియోజకవర్గాల వారీగా బతుకమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు బతుకమ్మ ఉత్సవాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, బతు కమ్మలను నిమజ్జనం చేసే ట్యాంకుల వద్ద అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జేసీ యాస్మిన్భాషా, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్రావు, డీఆర్డీవో, బతు కమ్మ చీరల పంపిణీ జిల్లా నోడల్ అధికారి రవీందర్, సీఈఓ గౌతమ్రెడ్డి, డీపీవో రవీందర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Authorization