- అఖిలపక్షం నాయకులు
- బురదమయంగా మారిన రోడ్లపై నాటు వేసి నిరసన
నవతెలంగాణ-వీర్నపల్లి
ప్రచార అర్భాటాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. మండలంలో రెండు రోజుల కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారడంతో వారు రోడ్లపై నాటు వేసి ఆదివారం నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో అంబేద్కర్ నగర్ నుంచి ఊరి చివరి వరకు డబుల్రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, దీంతో రోడ్లన్నీ గుంతలుగా మారయన్నారు. మండల వాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలను గొప్పగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్ నాయకులు మండలంలో నెలకొన్న సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ ఉంటే ఎప్పుడు పనులను ప్రారంభిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. లేకపోతే అమరణ నిరాహర దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తిరుపతి, మల్లారపు ప్రశాంత్, పిట్ల నాగరాజు, పోతారం నరేష్, రమేష్, మహేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Authorization