నవతెలంగాణ-కోల్సిటీ
న్యాయవాద వృత్తిలో మహిళలు మరింతగా రాణించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, వరంగల్ కోర్టు రిటైర్డ్ జడ్జీ గంట విద్యాసాగర్రెడ్డి అన్నారు. గోదావరిఖని పట్టణంలోని హైకింగ్ ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల శిక్షణా తరగతులు న్యాయవాది సీహెచ్ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో సత్యనారాయణ, విద్యాసాగర్రెడ్డి మాట్లాడారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న చట్టపరమైన, న్యాయపరమైన సహకారం అందించాలన్నారు. న్యాయవాది వృత్తిలో మహిళలు మరింతగా రాణించేందుకు వృత్తిపరమైన శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణా తరగతులలో మొదటిరోజు కర్నాటక బార్ కౌన్సిల్ మెంబర్ కోటేశ్వరరావు ఆర్థిక చట్టం, క్రిమినల్ ప్రాక్టీస్, ప్రొసెసర్పైన,అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పలు రకాల కేసులు తీరుపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ కల్పించాలని, మెరుగైన సమాజం కోసం పిల్లల సంరక్షణ బాధ్యతల పట్ల అవగాహన పెంపొ ందించాలని తదితర ప్రధాన డిమాండ్లను ప్రవేశపెట్టారు.
ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహిళా నూతన సబ్ కమిటీ కన్వీనర్గా శైలజ
ఈ సందర్భంగా ఆలిండియా లాయర్ యూనియన్ రాష్ట్ర మహిళ న్యాయవాదుల సబ్ కమిటీని 21 మంది మహిళా న్యాయవాదుల సభ్యులను ఎన్నుకున్నారు. ఈ మహిళ న్యాయవాద కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా సిహెచ్ శైలజ(గోదావరిఖని) ఎన్నికయ్యారు. కో-కన్వీనర్లు గా బత్తుల గీత(హైకోర్టు న్యాయవాది), ఎం.వనజ (రంగారెడ్డి న్యాయవాది)లను ఎన్నుకున్నారు.
Authorization