ఫోరం ఫర్ ఆర్టీఐ కరీంనగర్ జిల్లా కన్వీనర్గా ఆసంపెల్లి శేఖర్
నవతెలంగాణ-కరీంనగర్ టౌన్ ఫోరం ఫర్ ఆర్టీఐ కరీంనగర్ జిల్లా కన్వీనర్గా ఆసంపెల్లి శేఖర్ నియామకమయ్యారు. నగరం లోని ఎస్డీ హోమ్స్లో ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్గా ఆసంపల్లి శేఖర్, కో-కన్వీనర్గా తంగెళ్ల రామును రాష్ట్ర కమిటి నియమించింది. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005లో వచ్చిందని, ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తి తనకు కావాల్సిన సమాచారాన్ని ఏ శాఖ నుంచి అయిన పొందవచ్చని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతయ్య, మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి సమాజ ఉన్నతికి పాటుపడతానని తెలిపారు. ఈ సమావేశంలో 150 మంది యువకులు పాల్గొన్నారు.