- హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నవతెలంగాణ-కరీంనగర్ టౌన్ ఆడపిల్లలమని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల కళాశాల వసతి గృహాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. అనంతరం విద్యార్థినులతో సమావేశమై మాట్లాడారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.. మహాత్మాగాంధీజీ, డాక్టర్ బీఆర్. అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి దేశ భక్తుల జీవిత చరిత్రలు అధ్యయనం చేయాలని తెలిపారు. చదువులు కేవలం డిగ్రీల కోసం కాదని, చదువుకున్న చదువుకు సార్థకత చేకూరాలంటే సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. వారు చదువుతున్న తరగతులు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ ఎంపీ బండి సంజరుకుమార్, సీపీ కమలాసన్రెడ్డి, ఆర్డీవో ఆనంద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు పాల్గొన్నారు.