- 44 డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
అందరి సహకారంతో 44వ డివిజన్ను 60 డివిజన్లలో అగ్రగామిగా నిలిపెందుకు కృషి చేస్తానని 44 డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్కు ఆదివారం ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మెండి శ్రీలత చంద్రశేఖర్ అభివృద్ధి లక్ష్యంగా పని చేసి మూడోసారి సైతం ఘన విజయం సాధించారని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరం కుమార్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే మెండి చంద్రశేఖర్ ఏ పార్టీలో ఉన్న విజయం సాధించే వ్యక్తి అని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం మెండి శ్రీలత చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యేంత వరకే రాజకీయాలని ఎన్నికలయ్యాక అభివృద్ధి తమ ముఖ్య లక్ష్యం అన్నారు. తమ విజయానికి సహకరించిన తమ డివిజన్ ప్రజలు కుల బాంధవులకు జన్మత: రుణపడి ఉంటానని హామి ఇచ్చారు. ఎంపీ బండి సంజరు కుమార్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ నిర్మాణాన్ని ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామి, రాజేశం, గంభీరావుపేట అంజయ్య, ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు రామ్ శంకర్, రవి ఉన్నారు.
Authorization