కరాటే పోటీల్లో సువిద్య విద్యార్థులకు బంగారు పతకాలు
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 22, 23 తేదిల్లో నిర్వహించిన ఐదో జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సువిద్య పాఠశాలకు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కటాస్ విభాగంలో ఎం.శివాకమ, టీ.స్నేహిత్ బంగారు పథకాలు సాధించినట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బాబు, ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ కె.వసంత్కుమార్లు అభినందించారు. కరాటే కోచ్లు గూడ మానస, బుర్ర ప్రవీణ్ కుమార్ను పాఠశాల కరెస్పాండెంట్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడా కోచ్లు పాల్గొన్నారు.