- జెడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్రావు
- ప్రారంభమైన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
నవతెలంగాణ - వీర్నపల్లి
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జెడ్పీచైర్పర్సణ్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రబుత్వోన్నత పాఠశాల మైదానంలో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికలు వాలీబాల్ పోటీలను వారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడారంగ ప్రగతికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదన్నారు. ఈ అవకాశాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఆటల్లో రాణించాలని సూచించారు. ఈ టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల నుంచి మొత్తం 240 మంది పాల్గొంటారని, వారిలో బాలికల 120, బాలురు 120 మంది ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.
నాలుగు రోజులు క్రీడలు
నాలుగురోజులపాటు నిర్వహించే క్రీడల్లో బాలికలు10, బాలురు 10 జట్ల చొప్పున తలపడనున్నారు. ఇందుకోసం 80మంది పీఈటీలు, పీడీల పర్యవేక్షణలో క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక్కో జట్టుకూ ఇద్దరు చొప్పున 40మంది కోచ్, మేనేజర్లు హాజరవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మ్యాచ్లు జరగనున్నాయి.
పోటీలు ప్రారంభం..
ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన అండర్-16 వాలీబాల్ క్రీడాకారులు వారి వారి జిల్లాల మార్చ్ ఫాస్ట్ నిర్వహించి క్రీడా వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు చక్రదర్ రెడ్డి, ట్రేజరర్ సుదీరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్సై రామచంద్రం, జెడ్పీటీసీ గుగులోతు కళావతి, లక్ష్మణ్రావు, ఎంపీపీ మాలోతు భుల, రేణుక, ఏఎంసీ చైర్మెన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మెన్ రాజేష్, తహసీల్దార్ మజీద్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు ఎడ్ల సాగర్, శంకర్, సర్పంచ్ పాటి దినకర్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు అరుణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Authorization