- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్
- కరీంనగర్లో పుస్తక ఆవిష్కరణ
నవతెలంగాణ - కరీంనగర్టౌన్ : శ్రమ దోపీడీ నుంచి విముక్తికి మార్గం కమ్యూనిస్టు ప్రణాళికనే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ అన్నారు. ఆదివారం నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 172ఏండ్ల క్రితమే మార్క్స్, ఏంగిల్స్ కార్మిక వర్గానికి దిక్సూచిగా కమ్యూనిస్టు ప్రణాళికలు
రచించారన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశం బయటపడడానికి కమ్యూనిస్టు ప్రణాళిక దోహదపడుతుందన్నారు. సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయరంగాన్ని దెబ్బతీయడానికి అమోరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆహ్మనిస్తున్న మోడీ దేశభక్తి ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలో పాడి, పౌల్ట్రీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి ఇక్కడి రైతుల శ్రమను దోచుకెళ్లే ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్ పర్యటిస్తున్నారన్నారు. ఇక్కడ పేదలు ఆయనకు కనబడకుండా గోడ నిర్మించడం సిగ్గుచేటన్నారు. వందకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వర్ణవెంకట్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుడికందుల సత్యం, యు.శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవారెడ్డి, జి.భీమాసాహెబ్, బండారి శేఖర్, వెల్మరెడ్డి, రాజీరెడ్డి, ఎడ్లరమేశ్, రజినికాంత్, నాయకులు రాకేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Authorization