- అనంతగిరి రిజర్వాయర్లోకి 26న నీటి విడుదల?
- సీఎంఓ నుంచి ఆదేశాల..
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి..
- పునరావాసం లేక ఎస్సీ కాలనీ వాసుల భయాందోళన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ నిర్మించింది. మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర ) జలాశయంలో ఇది వరకే నిల్వ చేసి ఉంచిన నీటిని ఎత్తిపోతల ద్వారా అనంతగిరి (అన్నపూర్ణ ) జలాశయం వద్ద 93 మీటర్ల లోతు 56 మీటర్ల వెడల్పు గల మహాబావి (సర్జిపూల్ )లో 400 క్యూసెక్కుల నీటిని అధికారులు నిల్వ చేసి సిద్ధంగా ఉంచారు. 45 మీటర్ల ఎత్తు వరకు నీటిని అధికారులు నిల్వ చేసి ఉంచారు. గత డిసెంబరులోనే నీటిని రిజర్వాయర్లో ఎత్తి పోయాల్సిన అధికారులు నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయకపోవడంతో వాయిదా పడింది. సర్జిపూల్ నుండి అనంతగిరి జలాశ యంలో ఎత్తి పోసేందుకు రంగం సిద్ధమైన క్రమంలో ముంపునకు గురయ్యే అనంతగిరి నిర్వాసితులను అత్యవసరంగా గ్రామాన్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసవరావు గ్రామానికి వచ్చి మాట్లాడి ఇండ్లను ఖాళీ చేసి సహకరించాల్సిం దిగా కోరారు. అవసరమైతే ఇతర చోట ఎక్కడైనా అద్దెకు ఉన్నా 6 నెలలకు 20 వేల రూపాయలు చెల్లిస్తామని తెలిపారు.
సీఎంఓ కార్యాలయం నుంచి గ్రీన్ సిగల్
అనంతగిరి రిజర్వాయర్లోకి ఈ నెల 26న నీటిని వదిలేందుకు ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులకు గ్రీన్ సిగల్ వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్సీ కాలనీ వాసుల వద్దకు మండల రెవెన్యూ అధికారులు వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని గుర్తు చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఖాళీ చేస్తామని కాలనీ వాసులు బదులివ్వడంతో మధ్యాహ్నం కలెక్టర్ వస్తారు, సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ వెళ్లిపోయారు. ఈ లోపే ఇరిగేషన్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఉదయం నుండి రాత్రి చీకటయ్యేవరకు పోలీసులు గ్రామంలో సంచరించడంతో గ్రామస్తులు బలవంతంగా ఖాళీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. రాత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ రావు అనంతగిరి గ్రామంలోని ఎసీకాలనీ గృహాలకు నీటి లెవెల్ ఎక్కడి వరకు వస్తుందో పరిశీలించారు. 381 మీటర్ల స్థాయిలో ఇండ్ల బేస్మిట్స్ ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు ఇండ్లకు నీటి లెవెల్ మార్కింగ్ చేశారు. 384 మీటర్ల లెవెల్ లో ప్రభుత్వం నీటిని వదిలే అవకాశాలుండగా ముందుగా ఎస్సీ కాలనీ పూర్తిగా ముంపునకు గురయ్యే అవకాశముంది.
స్థలంపై కోర్టులో స్టే
నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేసేందు కు అనంతగిరి పోచమ్మ గుడి వెనుక ప్రాంతంలో 90 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమిలో మొత్తం 837 కుటుం బాలకు గాను మొత్తం 1200 ప్లాట్లను ఏర్పాటు చేసి రోడ్లు, నీరు, విద్యుత్, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులు కల్పించి ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మిం చింది. నిర్మాణం పనులు ఇటీవ లనే పూర్తి అయ్యాయి. ఇదే ఆర్అండ్ఆర్ కాలనీలో కోర్టుకు వెళ్లిన 110 మందికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లను కూడా నిర్మించింది. కాని ఎస్సీ కాలనీ వారికి సర్వే నెంబర్ 496లో కేటాయించిన స్థలం విషయంలో ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు యజమాని హైకోర్టుకు వెళ్లారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు స్టే విధించింది. దీంతో వారు అక్కడ ఇండ్లు నిర్మించుకోలేకపోయారు.
కోర్టు స్టే ఉంటే ఇండ్లు ఎలా నిర్మించేది?
ప్రభుత్వం ఆర్అండ్ఆర్ కాల నీలో ఎస్సీలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి నప్పటికీ కోర్టు స్టే ఉంది. దాంతో ఇండ్లు నిర్మించుకోలేదు. మరో వైపు అధికారులు ఉన్న ఇండ్లు ఖాళీ చే యాలంటున్నారు. కోర్టు స్టే తొల గించి ఇండ్లు నిర్మించుకునేల ప్రభుత్వం చొరవ చూపా లి. ఇండ్లు ఖాళీ చేసేందుకు ఇంకా గడువును ఇవ్వాలి
- బట్టు బాబు, అనంతగిరి నిర్వాసితుడు
గడువు ఇవ్వాలి..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో గ్రామ స్తుల ఇండ్ల నిర్మాణం పునాది దశలోనే ఉంది. ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కొంత వ్యవది పడుతుంది. ఇది అర్థం చేసుకుని అధికారులు గ్రామాన్ని ఖాళీ చేసేందుకు ఇంకా కొంత గడువును ఇవ్వాలి.
- పల్లె నర్సింహారెడ్డి, సర్పంచ్, అనంతగిరి
Authorization