Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీబీవీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్లో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు
నవ తెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆహారం అందించి డ్రాపౌట్స్ లేకుండా చూడాలని కేజీబీవీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. ఖమ్మంలోని జడ్పీ మీటింగ్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పీజీ, సీఆర్టీ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పీవో మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే అర్హతను బట్టి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని విద్యాధికారులు, సిబ్బంది సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి 71 మందిని సీఆర్టీలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏజెన్సీలోని కేజీబీవీ పాఠశాలల్లో మాత్రమే వీరు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో మదన్మోహన్, కొత్తగూడెం, మహబూబాబాద్ ఇన్చార్జి డీఈవో సోమశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు.