Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయ కమిటీని కొనసాగించండి
- రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు
- బస్సులు నడిపేందుకు చర్యలు చేపడతాం
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
నవతెలంగాణ -ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కోసం టూరిజంగా అభివృద్ధి పరుస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు శుక్రవారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు సమర్పించి ఆశీర్వచనం పలికారు. ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి బ్రహ్మౌత్సవాలలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తొలిసారిగా జమలాపురం వచ్చిన మంత్రి ఎర్రుపాలెం ఆర్చి గేటు నుండి జమలాపురం వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మత్తుల నిర్మాణానికి రూ1.60 లక్షలు జమలాపురం నుండి వెంకటాపురం వరకు ఆర్అండ్బి రోడ్డు మరమ్మతులు పనుల నిమిత్తం రూ.1.60 లక్షలు నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఈ రోడ్డు పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొత్త పనులు నిర్వహిం చలేక పోతున్నామని, కోవిడ్ అనంతరం దేవస్థానం వరకు డబల్ రోడ్డును విస్తరించే పనులు చేపడతామని ఆయన అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు దేవస్థానా నికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్సులను నడపాలని కోరగా సానుకూలంగా స్పందించి ఖమ్మం నుండి నేరుగా దేవస్థానానికి బస్సులను నడిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవస్థానానికి ధర్మకర్తల మండలి నూతన కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు డిసిసిబి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వరరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ రావు, వకుళ మాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరావు దంపతులు, జమలాపురం సర్పంచ్ మూల్పూరి స్వప్న, మాజీ జెడ్పిటిసి అంక శాల శ్రీనివాస రావు, ఎర్రుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు, జెడ్పిటిసి సభ్యురాలు శీలం కవిత, తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఎంపీడీవో రామకష్ణ, జమలాపురం ఎంపీటిసి శైలజ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకటరామిరెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బుర్ర నారాయణ, పంబి సాంబశివరావు, మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.