Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీపీఎస్ సతీష్
- యాజమాన్యం పర్మినెంట్ ఉద్యోగంతో పాటు, 25 లక్షల నష్ట పరిహారమివ్వాలి
నవతెలంగాణ-పాల్వంచ
విధినిర్వహణలో చేయి కోల్పోయి దివ్యాంగుడిగా మారినా ఉపేందర్ను నవభారత యాజమాన్యం ఆదుకునే దాకా ఉద్యమం ఆగదని టీవీపీఎస్ వ్యవస్థా పక అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. గత జులై 18 పాల్వంచ నవభారత్ కర్మాగారంలో యఫ్బీ యార్డ్ బీసీ 3 ఏరియాలో పనిచేస్తున్న గంగ బోయిన.ఉపేందర్ కన్వేయర్ బెల్టులో ప్రమాదవశాత్తు కుడి చేయి షోల్డర్ వరకు తెగిపోయిందన్నారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి, గాయం నుంచి కోలుకున్న తర్వాత నవభారత యాజమాన్యం పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని కోరగా వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో నవభారత్ కర్మాగారం గేట్ ముందు కుటుంబంతో రెండు రోజులుగా చేస్తున్న దీక్షకు టీవీపీ ఎస్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపునేని మాట్లాడుతూ ఉపేందర్ ఏ పని చేసుకోలేక అతని కుటుంబం నడిరోడ్డు మీద పడిందన్నారు. యాజ మాన్యం నిర్లక్ష్యంగా విధులకు తీసుకోకపోవడం చాలా దురదష్టకరమని, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యం మానవతా దక్పథంతో ఉపేందర్ను ఆదుకోవాలన్నారు. ఉద్యోగ అవకాశంతో పాటు, రూ.25 లక్షల నష్ట పరిహారం అందించే దాకా పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, టీవీపీఎస్ సభ్యులు నగేష్, నయీమ్, బిల్లా బాబురావు, మౌనిక, విజయ కుమారి, రాజమ్మ, కిషోర్, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.