Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఉత్తరప్రదేశ్లోని కాశీ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వెయ్యేళ్ల శతక సాహిత్యం-సమాలోచన అనే పేర అక్టోబర్ 23,24న జరుగుతున్న అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పత్ర సమర్పణకు కవి రచయిత అధ్యాపకుడు అట్లూరి వెంకటరమణకు ఆహ్వానం అందింది. ఖమ్మం జిల్లా కు చెందిన ప్రముఖ శతక కర్త మేడిపల్లి వేంకట లక్ష్మీనారాయణ దేశ భక్తి గేయ శతకంపై అట్లూరి వెంకటరమణ పత్ర సమర్పణ చేయనున్నారు. ఈ మేరకు కాశీ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సదస్సు సంచాలకులు ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి పత్ర సమర్పణకు ఆహ్వానం పంపారు.