Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమ్మపేట : మండల పరిధిలోని నాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యనభ్యసించి 10/10 జీపీ పాయింట్లు సాధించిన చాపలమడుగు చరణ్ కుమార్ బాసరలోని ఐఐఐటీలో సీటు సాధించాడని నాచారం పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఆర్. పద్మావతి తెలిపారు. సీటు సాధించిన చరణ్కుమార్ను పీఈటీ పద్మజ, పాఠశాల సిబ్బంది, విద్యా కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, గ్రామ పెద్దలు అభినందించారు.