Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూరగాయల రైతులతో కలిసి బీజేపీ నాయకుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత.. పలువురు అరెస్టు
- అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరు : కొండపల్లి
నవతెలంగాణ-ఖమ్మం
రైతుబజారు మూసివేతను నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. తొలుత పెవిలియన్ గ్రౌండ్ నుండి బీజేపీ నాయకులు కూరగాయల రైతులతో కలసి రైతు బజార్ మూసివేతను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయానికి బయలు దేరారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు జెడ్పీ సెంటర్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులకు, పోలీసులకు తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ రైతు బజార్ స్థలాన్ని ప్రైవేట్శక్తులకు అప్పచెప్పేందుకే జిల్లా మంత్రి అజరు కుమార్ కుట్ర చేస్తున్నారని, కలెక్టర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, కలెక్టర్ ఆర్.వి కర్ణన్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా మారి అన్నదాతల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ద్రోహం చేసిన వారిగా కలెక్టర్ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి అర్బన్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కొంతమంది కూరగాయలు అమ్ముకునే లైసెన్స్ రైతులు భావోద్వేగాలతో అర్బన్ పోలీసు స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, టూటౌన్ సీఐ గోపి, అర్బన్ సీఐ వెంకన్న బాబులు రైతులకు నచ్చ చెప్పి సెల్ టవర్ దించారు. రైతులు ఎవ్వరూ భావోద్వేగాలకు గురి కావొద్దని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు రుద్ర ప్రదీప్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, విద్యా సాగర్ వేల్పుల సుధాకర్, ప్రభాకర్ రెడ్డి, పుల్లేశ్వర్ రావు, వేణుగోపాల్రెడ్డి, ఆనంతు ఉపేందర్ గౌడ్, బోయినపల్లి శేఖర్, కూతురు మురళి, ఈదుల భద్రం ఎల్లా రావు, అంకటి పాపా రావు, శ్యామ్, పిల్లలమర్రి వెంకట్, రీగాన్ ప్రీతం, బట్టు నాగరాజు, వీరు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.