Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్
నవతెలంగాణ- ఇల్లందు
జిల్లాలో ఉన్న పోడు సాగుదారులపై ప్రభుత్వ నిర్బంధాలను నిలిపి వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే. రమేష్ పిలుపునిచ్చారు. పోడు సాగుదరులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు సాగుదారుల సమస్యలు పరిష్కరించాలని, అస్సైన్ భూములు,దేవాదాయ భూములు, బంజారా భూములు, తదితర భూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారం కోసం సీపీఎం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 25న ఛలో కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో కదలి రావాలని పిలుపునిచ్చారు. మండలంలో సిఎస్పి బస్తి గ్రామ పంచాయతీలో బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. పోడు సాగుదారులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతి నిధులు లోనక మాట బయట ఒక మాట మాట్లాడుతున్నారని అన్నారు. సాగుదారుల పక్షం నిలిచిన వారైతే ప్రత్యక్షంగా పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, మన్నెం మోహన్ రావు, పినబోయిన వెంకటేశ్వర్లు, కుంజ భద్రం, రాందాస్, జయసుధ, లక్ష్మి పాల్గొన్నారు.