Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గ్రాట్యూటీ వర్తింపచేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్( సిఐటియూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు అన్నారు. బుధవారం సిఐటియూ కార్యాలయంలో కొత్తగూడెం బ్రాంచి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తారీఖున జెబిసిసిఐ అపెక్స్ కమిటీ సమావేశం రాంచీలో జరగబోతుందని తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలిపారు.ఎంతో కాలంగా కార్మికులు ఎదురుచూస్తున్నటువంటి గ్రాట్యూటీ పెంపుదలను అధికారులకు1వ తేదీ జనవరి 2017 నుండి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచి వర్తింపజేసిన విధంగా దిగిపోయిన కార్మికులకు కూడా వర్తింపచేయాలన్నారు. జెబిసి స్టాండర్డైజేషన్ కమిటీ మీటింగ్లో అనేకసార్లు చర్చలు జరిగి అన్ని కంపెనీల నుండి రిటైర్డ్ అయిన కార్మికుల సమాచారము తీసుకొని ఎంత మంది కార్మికులకు ఎంత పేమెంట్ చేయాల్సి వస్తుందో ఒక్కొక్క కంపెనీ నుండి సేకరించి వివిధ వివరాల మీద నిర్ణయం తీసుకోవడానికి బోర్డ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగిందని అన్నారు.అప్పటి నుండి దాదాపు ఒక సంవత్సర కాలంగా బోర్డు కమిటీ సమావేశం ఏర్పాటు కాకపోవడం వల్ల దీనిపై ఎలాంటి నిర్ణయం చేయకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవటంలో తీవ్రమైన జాప్యం చేయడం జరిగిందని తెలియజేశారు.కానీ రేపు 22 వ తేదీన జరిగే అపెక్స్ బోర్డ్ కమిటీలో గ్రాట్యుటీ పెంపుదల విషయంలో ఎలాంటి ఎజెండా లేకుండా సమావేశం నోటీసు పంపించడం జరిగిందని అన్నారు.దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం,కోల్ ఇండియా యజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అంతే కాకుండా కార్మికులకు గ్రాట్యుటీ పెంపుదలను వర్తింప చేయకుండా ఉండాలనే ఉద్దేశం అర్థమవుతుందని, దీనిపై జరగబోయే సమావేశంలో సిఐటియు తరఫున బోర్డు సభ్యులు అయినటువంటి వారు గట్టిగా పట్టుబట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో సాధించేందుకు కృషి చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యులు నరసింహారావు డిడిని కోరారు. మిగతా సంఘాలు కూడా ఇదేవిధంగా ఈ సమావేశంలో గ్రాట్యుటీ పై ఐక్యతతో యాజమాన్యంపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, అధ్యక్షులు గాజుల రాజారావు, రాష్ట్ర కోశాధికారి వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కర్ల వీరస్వామి, జెబి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.