Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదర స్వాగతం పలికిన న్యాయవాదులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం కోర్టులో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులకు కొత్తగూడెం బార్ ఆసోసియోషన్ సాదరంగా ఆహ్వానం పలికారు. న్యాయమూర్తులు కె.దీప, ఎం.నీలిమలు బుధవారం కొత్తగూడెం కోర్టులో భాద్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బార్ ఆసోసియోషన్ హాల్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ ఆసోసియోషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షత జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని తెలిపారు. బార్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కొత్తగూడెం బార్ అసోసియోషన్ మంచి పేరుందని, న్యాయవాదుల కేసుల పరిష్కారంలో ఎప్పుడూ ముందుటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ అదనపు జిల్లా జడ్జి మహ్మాద్ అబ్దుల్ రఫీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పాలాది శిరీష, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఊటుకూరి పురుషోత్తమరావు, బార్ ఉపాధ్యాక్షులు పి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జనపరెడ్డి గోపీ కృష్ణ, జి.మహేశ్వరరావు, ఎస్కె. సాదీక్పాష, మునిగడప వెంకటేశ్వర్లు, మానిటరింగ్ కమిటీ సభ్యులు మెండు రాజమల్లు పాల్గొన్నారు.