Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను వైరా ప్రాంతీయ రవాణాశాఖ అధికారి కార్యాలయంలో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ బానోత్ శంకర్ నాయక్ ప్రాంభించారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ల ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి ఫిబ్రవరి 17 వరకు మాసొత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయ పరిది లోని 7 మండలాలకు సంబందించిన వాహనదారులను దశల వారీగా సమావేశం నిర్వహించి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైరా మండల జర్నలిస్టుల సమక్షంలో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు.