Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఖమ్మం, వైరాబ్రాంచి పరిధిలో తీసుకొన్న జే.ఎల్.జి, సోలార్, పసుక్రాంతి రుణాలు, ప్రాదమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి తీసుకున్న పాడి గేదెలు, ద్విచక్ర వాహనాల రుణములను గత కొన్ని సంవత్సరములగా చెల్లించక పోవడం వలన నిరర్ధక ఆస్తులుగా పరిగణించారు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన రుణాలను వైరా మండలం సిరిపురం గ్రామములో బుధవారం సహకార బ్యాంక్, ప్రాదమిక వ్యవసాయ సహకార సంఘంల సిబ్బంది ఆస్తులను జప్తులు చేసి వసూలు చేసినారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ హెడ్ ఆఫీస్ నుంచి నోడల్ ఆఫీసర్ ఎ.పద్మవతి, హెడ్ ఆఫీస్ నుంచి రికవరి సెక్షన్ మేనేజర్లు జే.అనిల్ కుమార్, చంధరావు, వైరా బ్రాంచి మేనేజర్ నాగరాణి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.