Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం గాంధీచౌక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి.కర్ణన్ చేతులమీదుగా కరపత్రాలు, గోడ ప్రతులను మంగళవారం ఆవిష్కరించారు. తదుపరి ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, ఆర్టీఏ మెంబర్ రామారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. వరప్రసాద్ కళాజాత బందం రోడ్డు భద్రత- అవగాహన ప్రచార రథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. 32 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తుందని, అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 18 -01-21నుండి 17-02-21 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. బైక్ నడిపే వాళ్ళు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు., కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని, మద్యం తాగి వాహనం నడప రాదని, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడప రాదని, నిర్లక్ష్యంగా ఓవర్ టేకింగ్ చేయరాదని అందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు. మాసోత్సవాలకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, ట్రాలీడ్రైవర్స్ లారీ డ్రైవర్లు, ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.