Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్న రాష్ట్ర జాత బుధవారం ఖమ్మంరూరల్ మండలానికి చేరుకుంది. ఈ జాతకు ఖమ్మంరూరల్ మండలంలో సిఐటియు అనుబంధ రంగాలు కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, మహిళా సంఘం, కెవిపిఎస్ ఘన స్వాగతం పలికాయి.ఈ సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్లో జరిపిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు మొత్తాన్ని మోడీ రద్దు చేసి కార్మిక వర్గ వెన్ను విరిచారని విమర్శించారు. ఈ జాతలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణ వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్, శ్రీనివాసరావు, తిరుమలాచారి, పి.రమ్య, జిల్లా కోశాధికారి మాచర్ల గోపాల్, కిసాన్ సభ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్ ,బిల్లింగ్ రంగం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ చారి, మండల అధ్యక్ష కార్యదర్శులు పాపాచారి, గూడ రామ బ్రహ్మం గౌడ్, దుంపల రాంబాబు, ఆంజనేయులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రేవతి, కాంతా లక్ష్మి, పద్మ, అరుణ, కిసాన్ సభ నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, కార్మిక సంఘం నాయకులు వెంకయ్య, నరసయ్య, సుబ్బయ్య, దేవుజా, విష్ణుకుమారి, శ్రీను, నాగేశ్వరరావు, రాంబాబు, వెంకటేశ్వర్లు, శ్రీను, రాధా, లలిత, సుభద్ర, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటీయు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జీపుజాతా కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొని ప్రసంగించారు. భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని, కార్మికులు తమ హక్కులకోసం ప్రశ్నించ కుండా చట్టాలలో మార్పులు చేస్తున్నాయని, అందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రమ్య, పెరుమాళ్ళపల్లి మోహన్రావు, వేల్పుల నాగేశ్వరరావు, సిఐటీయు మండల కన్వీనర్ వశపోంగు వీరన్న, ఎస్.కే పాషా, లక్ష్మా, సంగయ్య రామయ్య, కొమ్ము శ్రీను, అంగిరేకుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి : కార్మిక చట్టాల రద్దును ఉపసం హరించుకోవాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సీఐటీయు జాతా బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, మధు మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు విష్ణు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, సీఐటీయూ మండల నాయకులు గోపె వినరు కుమార్, నాయకులు తోటకురి రాజు, కొండ వేణు, జవ్వాజి పవన్, కోరుట్ల పాపయ్య ,సైదులు పాల్గొన్నారు.