Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన సవరణలో కార్మిక సంఘాల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలి
- ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చింతా రామచందర్
నవతెలంగాణ-ఖమ్మం
కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరణ చేసిన ఫలితంగానే ఆర్టీసీ కార్మికులపై పనిభారాలు పెరుగుతు న్నాయని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించాల్సిన కార్మిక సంఘాలు వ్యక్తిగత ప్రతిష్ట కోసం గ్రూపులుగా విడిపోయి ప్రకటనలకే పరిమితమై పనిచేస్తున్నాయని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన ్(సిఐటియు అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు చింతా రామచందర్ అన్నారు.
బుధవారం ఖమ్మంలోని మంచికంటి సమావేశ మందిరంలో వేము జాకబ్ అధ్యక్షతన ఏర్పాటైన స్టాఫ్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజినల్ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచందర్ ప్రసంగిస్తూ, ఆర్టీసీ పరిరక్షణ కార్మిక హక్కుల రక్షణ కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన 55 రోజుల నిరవధిక సమ్మె ముగింపు సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కావలసిన వేతన సవరణ, బాండ్లకు సంబంధించిన బకాయిల చెల్లింపుల ఊసే లేదన్నారు. తక్కువ వేతనాలున్న ఆర్టీసీ కార్మికులకూ వేతన సవరణ చేస్తామన్న ప్రభుత్వం కార్మిక సంఘాల నుండి వచ్చే సర్వీసు కండీషన్లు, వేతనాల డిమాండ్లను పరిశీలించకుండా వేతన సవరణ చర్చలు ఎలా చేస్తారో, కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తారో అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఖమ్మం రీజియన్ కార్యదర్శి గడ్డం లింగమూర్తి నివేదిక ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో తార్నాక హాస్పిటల్ను వంద పడకల కోవిడ్ హాస్పిటల్గా మార్చి ఆర్టీసీ కోవిడ్ బాధితులకు వైద్య సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు మరియు పరపతి సహకార సంఘం (సిసిఎస్)కు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బస్సు పాసుల రాయితీల సొమ్మును వెంటనే చెల్లించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం ద్వారా కార్మిక సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పని చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకూ వేతన సవరణ చేస్తామంటున్న ప్రభుత్వ ప్రకటనలను స్వాగతిస్తున్నామని, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఇప్పటికే 18 శాతం వేతనాల్లో తేడాలు ఉన్నాయని, అందువలన ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా వేతన సవరణ జరగాలంటే ఆర్టీసీ లోని కార్మిక సంఘాల ప్రతిపాదనలు కూడా పరిశీలించాలని, కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో అమలవుతున్న 1963 కాండాక్ట్ రెగ్యులేషన్స్ను సమూలంగా మార్చాలని ఆయన ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముందుగా కుడుదుల వెంకన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతినిధులందరూ మౌనం పాటించి మృతవీరులకు నివాళులర్పించారు. మొత్తం 150 మంది కార్యకర్తలు పాల్గొన్న జనరల్ బాడీ సమావేశంలో రీజనల్ ఉపాధ్యక్షులు జాజుల నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి పిట్టల సుధాకర్, కోశాధికారి తాళ్ల సితార, ఖమ్మం రీజియన్లోని ఆరు డిపోల అధ్యక్ష కార్యదర్శులు కురవటి ప్రతాప్, కేవీ రామారావు, చింతలచెరువు కష్ణారెడ్డి, జి.శంకర్, తోకల బాబు, సామ్యేలు, గుండు మాధవరావు, సామా ప్రభాకర్రావు, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.