Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు
నవతెలంగాణ- వైరా టౌన్
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 56 రోజులుగా ఎముకలు కోరికే తీవ్ర చల్లిలో ఉద్యమం చేస్తున్న లక్షలాది మంది రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రైతు బస్సు జాతా ఖమ్మం జిల్లాలో జనవరి 22న జరుగుతుందని, రైతు బస్సు జాత సందర్భంగా 22వ తేది ఉదయం 9 గంటలకు ఏన్కూర్, 10 గంటలకు తల్లాడ, 12 గంటలకు వైరా, సాయంత్రం 4 గంటలకు బోనకల్, 6 గంటలకు మద్దుల్లపల్లి, 7:30 గంటలకు కుసుమంచి మండల కేంద్రాలలో జరుగు రైతు సభలలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్ని జయప్రదం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు పిలుపు నిచ్చారు. బుధవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో బోడపట్ల రవీందర్ అధ్యక్షతన సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాదిమంది రైతులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదష్టకరమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను అమలు చేయడానికి నిరసనగా ప్రజలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి, చింతనిప్పు చలపతిరావు, మల్లెంపాటి రామారావు, కమిటీ సభ్యులు బొంతు సమత, అనుమోలు రామారావు మల్లెంపాటి ప్రసాదరావు, పైడిపల్లి సాంబశివరావు, హరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు