Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-సుజాతనగర్
ఈ నెల 25న కలెక్టరేట్ ముందు జరిగే ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీ నగర్ నందు జీపు జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వాలని, సొంత స్థలాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని, 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి రూ.3వేల వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. ఈ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృంద కారత్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, మండల కార్యదర్శి వీర రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు మల్లె పైన లింగన్న, కాట్రా ల తిరుపతిరావు, భూక్య శంకర్ ,సిద్దుల నరేందర్, సతీష్ పాల్గొన్నారు.