Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనింగ్ డిప్లమా పట్టభద్రుల ప్రదర్శన, సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో జెఎంఈటి ఉద్యోగాల భర్తీకోసం యాజమాన్యం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి మైనింగ్ డిప్లమా పూర్తి చేసిన నిరుద్యోగులకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వంగా వెంకట్ డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లో జెఎంఈటి ఉద్యోగాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జెఎంఈటి ఉద్యోగాల నియామకాలు చేపట్టిన యాజమాన్యం ఆరేండ్లు గడుస్తున్నా ఉద్యోగ ప్రకటన విడుదల చేయకుండా జాప్యం చేస్తుందన్నారని విమర్శించారు. సంస్థలో జెఎంఈటి ఖాళీలు ఉన్నప్పటికి ప్రస్తుతం ''పనిచేస్తున్న కార్మికులతోనే పనిచేయిస్తూ పనిభారం మోపుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో కోల్బెల్ట్ (ప్రాంతాల్లోని కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు మైనింగ్ డిప్లమా కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారన్నారు. త్వరలో 651పోస్సలు భర్తీ చేస్తామని (ప్రకటించిన యాజమాన్యం వీటిలో జెఎంఈటి పోస్షులు చేర్చక పోవడంతో డిప్లామా పట్టభద్రులు నిరాశకు గురి అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎస్కె.ఖయ్యూం, ఎస్కె.ఫహీమ్ దాదా, ఏఐటీయూసీ నాయకులు పిట్టల రాంచందర్, వివిధ ఏరియాలకు చెందిన మైనింగ్ డిప్లమా పట్టభ్యదులు పి.యువసాయి రాజా, జె.వినరు, రణధీర్, బి.శ్రీకాంత్ పాల్గొన్నారు.