Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-పాల్వంచ
కేజిబివి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టిఎస్ యూటీఎఫ్ భద్రాద్రి జిల్లా అద్యక్షులు కిశోర్సింగ్, ప్రధాన కార్యదర్శి బి రాజు డిమాండ్ చేశారు. బుధవారం పాల్వంచలోని కస్తూర్భా గాంధీ ఆర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 29న జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహారదీక్ష, 12న విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు, ఎన్ రాధాకృష్ణ, మండల అద్యక్షులుమంగీలాల్, ప్రధాన కార్యదర్శి ఎస్కె యాకూబ్పాషా, సీనియర్ నాయకులు ఎ నర్సింహారావు, కే రాంబాబు, ఎస్ రాజశేఖర్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ తులసి, ఉపాధ్యాయులు మాధవి, ఆదిలకిë, రేణుక తదితరులుపాల్గొన్నారు.
చండ్రుగొండ : కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టియస్ యుటియఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో బాగంగా బుధవారం కెజిబివి నందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ఎస్ఓ బి కాంత కుమారి అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టియస్ యుటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమకొండ రవి కుమార్ మాట్లాడుతూ కెజిబివి సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైంస్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పిఇటిలను పిడిలుగా అప్గ్రేడ్ చేయాలని అన్నారు. పోస్టుకు తగ్గ వేతనం చెల్లించాలని, అన్ని రకాల సెలవుల సౌకర్యం కల్పించాలని, కేజీబీవీ యుఆర్ఎస్, ఎస్ఓలకు ప్రిన్సిపాల్ హౌదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా జరిగే నిరహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియస్ యుటియఫ్ మండల అధ్యక్షులు ఎం విజరు కుమార్, మండల నాయకులు టి లక్ష్మణ్, కెజిబివి ఉపాధ్యాయురాలు సిబ్బంది పాల్గొన్నారు.
పినపాక : కేజిబీవీ, యుఆర్ఎస్ సమస్యల పరిష్కారం కోసం టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేజిబివి, యుఆర్ఎస్ సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం భోజన విరామ సమయంలో కేజిబివి పినపాకలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజు మాట్లాడతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా జీతాలను, సెలవులు ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి.వి. ఎస్ ప్రసాద్, పినపాక మండల అధ్యక్షులు బి హనుమా, కరకగూడెం ప్రధాన కార్యదర్శి బి రాము, మణుగూరు అధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు.