Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీల ఆధ్వర్యలో రిలే దీక్షలు
నవతెలంగాణ-కొత్తగూడెం
పాల్వంచ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తన్న అంగన్ వాడీలకు పెండింగ్లో ఉన్న 5నెల వేతనాలు, 22 నెలల ఇంటి అద్దెలు వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ అండ్ యూనియన్ (సిఐటియూ) జిల్లా కార్యదర్శి జి.పద్మ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాల్వంచ ప్రాజెక్టు పరిధి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున రిలే దీక్షలు ప్రారంభించారు. లక్ష్మీదేవిపల్లిలోని సిడిపిఓ కార్యాలయం ముందు చేస్తున్న దీక్షలను ఉద్దేశించి పద్మ మాట్లాడారు. 22 నెలలుగా ఇంటి అద్దెలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అద్దె చెల్లించక పోవడంతో ఇంటి ఓనర్లు సామాన్లు బైట పారెస్టున్నారని తెలిపారు. నెలకు రూ.4వేలు ఎలా కడుతారని తెలిపారు.సిడిపిఓ, యూడిసీ నిర్లక్ష్యం కారణంగానే 22 నెలలుగా ఇంటి అద్దెలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. గత 7 నెలలుగా పెండింగ్లో ఉన్న మిని అంగన్ వాడీల వేతనాలు చెల్లించాలన్నారు. రిలే దీక్షలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు పట్నం రాష్ట్ర నాయకలుఉ దొడ్డ రవికుమార్, సిఐటియూ సీనియర్నాయకులు నల్లమల్ల సత్యనారాయణ, వ్యకాస జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ, యర్రగాని కృష్ణయ్య, నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం జిల్లా కోశాధికారి పి.పద్మ, రమ్య, అచ్చమ్మ, పుష్ప, రమాదేవి, అంజమ్మ, వెంకటమ్మ, మణి, సుభద్ర, రాజ్య, చంద్రకళ, విజశ్రీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.