Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో కమలాపురం పంచాయతీ శివారు అయ్యగారిపల్లిలో కాకుమాను రమణారెడ్డి అనే రైతు పొలంలో యాసంగి సాగులో భాగంగా మంగళవారం యంత్రం సాయంతో వరినాట్లు వేశారు. ట్రాక్టర్ డ్రైవర్ సహాయంతో దమ్ము చేసిన పొలంలో టిల్లర్ లాగానే వరినాట్లు వేసుకుంటూ ముందుకు వెళ్ళి పోతూ సాలు కాగానే మరో సాలులో నాటు వేసుకుంటూ పోతోంది. ముదిగొండ మండలంలోని మొట్టమొదటిసారిగా వరినాట్లు వేసే యంత్రం రావటం విశేషం. దీంతో కూలీల కొరతతో రైతులకు ఉపశమనం కానుంది. ఈ సందర్భంగా రైతు కాకుమాను రమణారెడ్డి మాట్లాడుతూ సాంకేతికత పెరిగేకొద్దీ సమాజ గమనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ వారివేసే యంత్రం కూడా రావటం హర్షణీయమన్నారు.
మండలంలోని ఎవరైనా యాసంగి వానాకాలం వరి పొలాలు సాగు చేసే రైతులు యంత్రంతో నాట్లు వేసుకోవాలనుకుంటే నాటువేసే యంత్రం అందుబాటులో ఉందన్నారు. రైతు సాగుకు పెట్టే పెట్టుబడికి యంత్రంతో వేసే నాటు ఖర్చు పెద్ద తేడా ఉండదన్నారు. నాటు వేసే యంత్రం కావాలనుకునేవారు 9912672918 సంప్రదించాలన్నారు.