Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
టీఆర్ఎస్ బలపరిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి మలుపుగా అని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మ, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ గురువారం సాయంత్రం వైరా నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్తో కలసి పొంగులేటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు కాలనీలలో పర్యటించి పట్టభద్రులను కలసి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున ఓట్లను అభ్యర్ధించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావణి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పసుపులేటి మోహన్రావు, దార్న శేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కొణిజర్ల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీను, చింతనిప్పు రాంబాబు పాల్గొన్నారు.