Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకుడు యనమద్ది శ్రీనివాసరావు ఆకస్మిక మృతి విద్యారంగానికి, ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన యుటిఎఫ్ బోనకల్ మండల పూర్వ అధ్యక్షులు యనమద్ది శ్రీనివాసరావు సంతాప సంతాప సభ పెద్ద బీరవల్లి గ్రామంలో టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండా రాంబాబు అధ్యక్షతన గురువారం జరిగింది. తొలుత శ్రీనివాస రావు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సంతాప సభలో వారు మాట్లాడుతూ ఆయన విద్యారంగానికి, పెద్దబీరవల్లి గ్రామ అభివృద్ధికి చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర రావు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జివి నాగ మల్లేశ్వర రావు, జిల్లా నాయకులు లక్ష్మణ్రావు, టీడీపీ నాయకులు వల్లంకొండ వెంకటరాములు, మధిర మండల అధ్యక్షులు వినోద్రావు, అనుమోలు కోటేశ్వర రావు, పెద్ద బీరవల్లి సోసైటీ అధ్యక్షులు చింతల చెరువు కోటేశ్వరరావు, టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి చల్లగుండ్ల రామ నరసయ్య, యనమద్ది రాధాకృష్ణ, పెద్ద బీరవల్లి మాజీ సొసైటీ అధ్యక్షుడు ఆళ్ల ప్రసాద్, ఆ సంఘం నాయకులు పి.సుశీల, ప్రీతం, ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, నరసింహ రావు, గోపాల్రావు, ఏ.అనిల్ కుమార్ పాల్గొన్నారు.