Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
దళితులపై అసభ్యకర పదజాలంతో దూషించిన హైదరాబాద్ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్, ఇతర దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం విషయమై బిజెపి నాయకులు చేపట్టిన నిధుల సేకరణలో గోమాంసం తింటున్న దళిత లం..... కొడుకులను విరాళాలు అడగవద్దని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది దళితుల పట్ల బీజేపీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఉన్న చిత్తశుద్ధికి, అహంకారపూరిత విధానాలకు అద్దం పడుతోందన్నారు. దళిత కులాల మనోభావాలను దెబ్బతీసేలా దళిత మహిళను అగౌరపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు పొట్టపింజర నాగులు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు పొట్టపింజర రాజేష్ పాల్గొన్నారు.