Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని శ్రీసాయి మారుతి వైద్యశాలలో గురువారం ఓ బాలుడికి అరుదైన వైద్య చికిత్స అందించారు. దమ్మపేట మండలం చెందిన జయవర్ధన్ అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇంట్లో ఉన్న పిన్నీసును మింగేశాడు. అటు తర్వాత ఆ బాలుడు ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్యానికి గురి అవుతూ ఉండడంతో తల్లిదండ్రులు సత్తుపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా బాలుడి కడుపులో పిన్నిసు తెరుచుకొని ఉండడంతో అక్కడి వైద్యులు బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఖమ్మంలోని సాయి మారుతి వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ హరి ప్రసాద్ ఎండోస్కోపీ ద్వారా బాలుడికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా కడుపులో గుచ్చుకుని ఉన్న పిన్నిస్ను బయటికి తీసి వేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎంతో కష్టపడి ఎండోస్కోపీ విధానం ద్వారా బాలుడికి వైద్య చికిత్సలు చేసిన సాయి మారుతి వైద్యశాల వైద్యులు, సిబ్బందికి బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.