Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముదిగొండ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ఆవేదన వ్యక్తం చేశారు అంతర్జా తీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని గోకినేపల్లి గ్రామంలో గురువారం ఐద్వా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వాలు మహిళా చట్టాలను పటిష్ట పరిచి రక్షణగా చర్యలు చేపట్టాలన్నారు. బాలికల సంరక్షణ విభాగం సీసీ మచ్చా అనితను ఈ సందర్భంగా వారు అభినందించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ, మండల కార్యదర్శి పయ్యావుల ప్రభావతి, నాయకురాళ్లు శాంతి, లక్ష్మీ, సంధ్య, ఎస్.కె హుస్సేన్ బి పాల్గొన్నారు.