Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ చెప్పినా వినని రెవెన్యూ అధికారులు
- తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధురాలి ఆందోళన
- వ్యకాస, గిరిజన సంఘం సంఘీభావం
నవతెలంగాణ-కొత్తగూడెం
భూమి ఉంది... దానికి హక్కుపత్రాలు, పట్టా ఉంది. కానీ, సవతి బిడ్డల వేధింపులు... భూమి మీదికి రావద్దని బెదిరింపులు... ఏమిచేయాలో తెలియన 75 ఏండ్ల వృద్దురాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేసింది. వృద్దురాలి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం... గిరిజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు హామీ ఇవ్వడంతో కమలమ్మ దీక్ష విరమించిన సంఘటన గురువారం జరిగింది....
లక్ష్మిదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం గ్రామా నివాసి యల్లావుల కమలమ్మ తన భర్త రామయ్య, రామయ్య మొదటి భార్య చనిపోవడంతో ఆమె ఆరుగురు సంతానం సంరక్షణ కోసం గత 50 సంవత్సరాల క్రితం కమలమ్మను రామయ్య రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కమలమ్మకు ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. నాటి నుండి నేటి వరకు వాళ్ళ సంరక్షణ బాధ్యత చూస్తున్న కమలమ్మకు, రామయ్యకు వధ్యాపంలో ఆయన స్వార్జితం అయిన భూమిలో కొంత భాగం కమలమ్మకు కేటాయించారు. కుమారులు పట్టించుకోక పోవడంతో 2016 సంవత్సరంలో కొత్తగూడెం కోర్టు సీనియర్ సిటిజెన్ యాక్ట్ క్రింద పిటిషన్ వేశారని తెలిపారు. నా భర్త సంపాదించినా 40 ఎకరాల భూమి నుండి మూడు ఎకరాల భూమిని నాకు కేటాయిస్తూ కోర్టు తీర్పు నివ్వడం జరిగిందన్నారు. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయగా మొదటి భార్య కొడుకులు యల్లావుల రాజమల్లు, మోహన్ రావు, జగన్ మోహన్ రావు, మురళి అనే వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడి పాతిన పోల్స్ పికి వేశారని తెలిపారు. పోలీసులను ఆశ్రయిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా సమస్యను పరిష్కరించాలని కమలమ్మ కుటుంబ సభ్యులతో తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం నిరసన దీక్ష చేశారు.
సంఘీభావం
కమలమ్మ దీక్షకు మద్దతుగా తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణా గిరిజన సంఘం, తెలంగాణా ఆదివాసి గిరిజన సంఘం, నాయకత్వం పాల్గొని మద్దతు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో జాటూత్ కృష్ణ, వాంకుడోత్ అమర్ సింగ్, వాంకుడోత్ సీతారాం, వాంకుడోత్ కోబల్, ఎన్.నాగేశ్వరరావు, పాల్గొన్నారు.
తహసీల్దార్ హామీ
కమలమ్మ చేస్తున్న నిరసన దీక్షకు స్పందించిన తహసిల్దార్ నాగరాజు వారం రోజుల్లోగా భూమిని సమగ్ర సర్వే జరిపి అప్పగిస్తానని, హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.