Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో ఎక్కడ నేరం జరిగిన క్లూ కోసం చేసే ప్రయత్నంలో పోలీస్ జాగిలాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. హైదరాబాదులోని మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో హ్యండ్లర్ బి.నరేష్, నవ్యంత్ ఆధ్వర్యంలో ఎనిమిది నెలల పాటు మాదకద్రవ్యాలను పసిగట్టే శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన పోలీసు జాగిలం ''స్కూబి'' మాదక ద్రవ్యాల వెలికితీతలో చేధించిన విన్యాసాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. నిరంతరం శిక్షణ, ఆహారం, వైద్య పర్యవేక్షణలో ఉండే జాగిలాలు గంజాయి వంటి మత్తుపదార్థల అచూకీ సులభంగా కనిపెట్టి కేసుల చేధనలో పోలీసులకు వెనుదన్నుగా ఉంటున్నాయని అన్నారు. బాంబులను గుర్తించటం, నిర్వీర్యం చేయడంలో శిక్షణ పొందిన బాంబు డిస్పోజల్ స్వాడ్ విభాగం ఏఆర్ కానిస్టేబుళ్లు ఉదరు కుమార్, రాములును పోలీసు కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఏఆర్) కుమారస్వామి, ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసిపి విజయబాబు, ఆర్ ఐలు రవి, శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు.