Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
చనిపోయిన వ్యక్తికి తలకొరివి పెట్టేందుకు కొడుకులు లేకపోవడంతో ఆ బాధ్యతను కూతురు నిర్వర్తించింది. ఈ ఘటన మండల పరిధిలోని జనంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మధ్యాహ్నం ప్రసాద్(35) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవటంతో ఉన్న ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె భవిత తలకొరివి పెట్టి దహనసంస్కారాలు నిర్వహించారు. తల్లి రాణి, చెల్లితో కలిసి తండ్రికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.