Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం గేటుకారేపల్లి పరిధిలోని సంగెంకుంట చేపల చెరువు వ్యవహారం వివాదస్పదంగా మారి గురువారం ఉద్రిక్తత పరిస్ధితు లకు దారితీసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ కుంట ను బానోత్ అనిల్ కుమార్ అనే వ్యక్తికి కౌలుకు ఇవ్వగా అనిల్కుమార్ దానిలో చేపల పెంపకం చేపట్టాడు. దుబ్బతండా మత్య్స సహకార సంఘంకు చెందిన వ్యక్తులు సంగెంకుంట తమ పరిధి అంటూ కొంతకాలం వాదోపవాదనలు చేస్తున్నారు. ఈ కుంట వ్యవహారమై మత్స్య శాఖ, రెవిన్యూ అధికారులకు దేవదాయశాఖ, పర్సాఅనంతరామయ్య ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, సంగెంకుంట దేవదాయశాఖదేనని దానిపై విచారణచేయాలని లేఖలో కోరారు. ఈ వివాదం నడుస్తుండగా గురువారం మత్స్య సహకార సంఘంకు చెందిన వ్యక్తులు గురువారం సంగెంకుంటలో చేపలు పట్టటంతో వివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. కౌలుకు తీసుకున్న బానోత్ అనిల్కుమార్, మత్స్య సహకార సంఘం సభ్యులపై కారేపల్లి పోలీస్లకు పిర్యాదు చేయగా కుంటవద్దకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలు చేపలు పట్టవద్దని హెచ్చరించారు. పూర్తి ఆధారాలతో పోలీసు స్టేషన్ రావాలని తెల్పటంతో కుంట వద్ద ఉద్రిక్త పరిస్ధితి శాంతించింది.