Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ సెక్రటరీ విధులకు అడ్డుగా సర్పంచ్
- పంచాయతీరాజ్ నిబంధనలకు తూట్లు
నవతెలంగాణ-ముదిగొండ
గ్రామస్తుల కథనం మేరకు మాదాపురం గ్రామంలో కొత్త పాలకవర్గం ఏర్పడిన కాలం నుండి నేటి వరకు పంచాయతీ పైపు లైన్కు కనెక్షన్ కలిపి మూడు క్యాన్లు అరవై లీటర్లగా ప్రైవేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామస్తులు ఇదే విషయా న్ని మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయగా మూడు నెలల కాలానికి విచారణకు వెళ్ళి మరో మూడు నెలల కాలానికి నివేదికను ఉన్నత అధికారులకు పంపినట్లు సదరు ఫిర్యాదుదారుడు ఆ గ్రామ నివాసి కొలికపొంగు వెంకట్రావు తెలిపారు. మరోవైపు పంచాయతీ నిధులు ప్రైవేటు నీళ్ల వ్యాపారం అవినీతి సర్పంచ్ భాగోతం అంటూ పలు దినపత్రికలలో కథనాలు వచ్చాయి. దిన పత్రికలలో కథనాలు రాగానే ఒకటి రెండు రోజులు నిలిపివేశారు. మరలా పంచాయతీ తీర్మానం చేశాము అంటూ మరలా యథా రాజ్యం తధాప్రభువు అన్నట్టుగా నిరాటంకంగా జోరుగా నీళ్లు వ్యాపారం కొనసాగుతుంది. అలా పంచాయతీ తీర్మానం చేసుకొని వ్యాపారం చేస్తున్న వారు లాభంలో వాటాను గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏమైన ఉపయోగిస్తున్నారా, మరి పంచాయతీ నిధుల నుండి కరెంట్ , మోటర్ బిల్లులు ఎలా కట్టుతు న్నారు అని పలువురు గ్రామ స్తు లు ఆరోప ిస్తున్నారు. ఇటీవల కాలంలో మాదా పురం గ్రామ పంచాయతీ పలు వివాదాలకు కేంద్రంగా మారింది. కరోనా కష్టకాలంలో నిబద్ధతగా గ్రామానికి సేవలు అందించి గత 18 సంవత్సరాల కాలం నుండి గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్గా విధులు నిర్వహిస్తు నెల జీతం 1500 రూపాయల నుండి పనిచేస్తున్న ఆ గ్రామానికి చెందిన పడిశాల నాగేశ్వరరావు అనే దళిత వ్యక్తి చిన్న చిన్న వ్యక్తిగత కారణాలు చూపి విధుల నుండి తొలగించారు. వీరు చూపిన చిన్న చిన్న సాకులకు ప్రతిగా గ్రామ ప్రజలు ఆయనకు అనుకూలంగా పని విధానానికి మెచ్చుకొని సంతకాలు చేసి పంచాయతీ పాలకవర్గానికి ఇచ్చారు. మెజార్టీ గ్రామ ప్రజలు పడిశాల నాగేశ్వరరావును విధులలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ రెక్క ఆడిదే కాని డొక్కా ఆడని ముగ్గురు ఆడ పిల్లల తండ్రి గత 8 నెలల కాలం నుండి కరోనా సంక్లిష్ట పరిస్థితిలలో జీవన ఉపాధికి దూరమైన తనను విధులులోకి తీసుకోవాలని బతుకు పోరాటం చేస్తున్నాడు. కానీ ఒక వైపు అండ బలం ఒక వైపు ధన బలం సర్పంచ్ కులానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు, ఒక ఉన్నతాధికారికి చెందిన సిసి ఒకవైపు ఆయన్ని అడ్డుకోవడానికి సర్పంచ్కి సహకరిస్తున్నారు అని వాపోతున్నాడు. ఏదేమైనా మరల అక్రమ పైపు లైన్ కనెక్షన్ తొలగించాలని నోటీసులు అయితే జారీ చేశారు. తొలగించటానికి వెళుతున్న సెక్రెటరీని గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుంటున్నారు. మరల గతంలో మాదిరిగానే తూతుమంత్రంగానే హడావుడి చేసి ఆపుతారా లేక తొలగిస్తారా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్న వాదనలు వినిపిస్తున్నాయి.