Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
నవతెలంగాణ-పినపాక
మండల పరిధిలోని జానంపేట గ్రామంలో కొలువైన నాగులమ్మ దేవాలయంలో జాతర వాతావరణం గత మూడు రోజులుగా ఆహ్లాదకరంగా కొనసాగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన నిండు జాతర అంగరం గవైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని కోరికలు కోరుకొని, మొక్కు లు చెల్లించుకున్నారు. చిత్ర విచిత్ర వేశాలతో వేశగాళ్ళు చిన్నారులని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు ఎంతో వైభవంగ కనువిందు చేశాయి. ఎంపీడీఓ శ్రీనివాసులు, తహశీల్దార్ విక్రంకుమార్, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మకమిటీ ఛైర్మన్ భద్రయ్య, సహకార సంఘ చైర్మన్ రవివర్మ, సర్పంచ్ బాడిష మహేష్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏడూళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎసై టివిఆర్ సూరి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు.