Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22న స్వామి వారి మహాపట్టాభిషేకం
- నేటి నుంచి ఆన్ లైన్ లో శ్రీరామనవమి టికెట్ల విక్రయాలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న శ్రీరామనవమిని పరష్కరించుకొని నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం, 22న నిర్వహించే స్వామి వారి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. గత ఏడాది కోవిడ్-19 మూలంగా నిత్యకల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణంను, మహా పట్టాభిషేకంను నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ఏడాది స్వామి వారి కల్యాణం పట్టాభిషేకంను మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలోనే నిర్వహించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. కల్యాణం టికెట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు దేవస్థానం ఈ మేరకు నిర్ణయించింది. శుక్రవారం నుంచి టికెట్లను వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని దేవస్థానం ఈఓ బి.శివాజీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకనుగుణంగా నిర్దేశిత సంఖ్యలో 50 శాతం మందినే అనుమతించాల్సి ఉండటంతో దేవస్థానం అధికారులు మొత్తం టికెట్లలో 50 శాతం మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా శ్రీరామనవమి, మహా పట్టాభిషేకంలను మిధిలా స్టేడియం లేదా రామాలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండప వేదికలలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టతనివ్వాలని ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ను లేఖలో కోరారు.