Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుని కటుంబాన్ని పరామర్శించిన కోదండరాం
- 8 మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-అశ్వాపురం
భూ వివాదం ఘటనలో వంటిపై పెట్రోల్ పోసుకుని మృతి చెందిన గూడూరు మల్లారెడ్డి కుటుంబీకుల ఆందోళన గురువారం కూడా కొనసాగింది. బుధవారం సాయంత్రం నుండి వివాదాస్పద భూమిలో మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసే ప్రసక్తే లేదని మృతుని కుటుంబ సభ్యులు, బందువులు భీస్మించుకుని కూర్చున్నారు. సంఘటన స్థలానికి మణుగూరు ఏఎస్పీ శబరీష్, తహశీల్దార్ వి.సురేష్ కుమార్ వెళ్ళి సర్ది చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. తమకు తక్షణం న్యాయం చేస్తేనే మృతదేహాన్ని తీస్తామని ఆందోళన కారులు చెప్పడంతో మొండికుంట ప్రాంతంలో క్షణ క్షణం ఉత్కంఠత నెలకొంటోంది.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీజేఏస్ అధ్యక్షుడు కొదండరాం
భూ వివాడంలో పెట్రోల్ పోసుకుని మృతిచెందిన మల్లారెడ్డి కుటుంబాన్ని గురువారం తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండరాం పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేసారు. స్థానిక అధికారులు తక్షణం స్పందించి బాదిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.
8 మందిపై కేసు నమోదు :
ఈ కేసులో అశ్వాపురం సీఐ సట్ల రాజు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసారు. మృతుని మరణ వాంగ్మూలంతో పాటు ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు మేడవరపు మంగపతి, సుధీర్, సురేష్, తుక్కాని రాంరెడ్డి, కాసరబాద సత్యం, రాములు, సందీప్, పర్వత నరేష్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.