Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసూతి బాధకంటే...పైసల బాధేఎక్కువైంది
- ఏరియా ఆసుపత్రిలో పెరిగిన కలెక్షన్
- బాలింతల బాధలు....వెతలు పటించుకోరా...?
ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వ అసుపత్రిలోనే పురుడుపోసుకోవాలి....కేసీఆర్ కిట్ తీసుకోవాలని ఊదర కొట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలకు భిన్నంగా ఏరియా అసుపత్రులు తగలబడ్డాయి. పండంటి బిడ్డకు జన్మనిద్దామని దవఖానకు వచ్చి పురిటి నొప్పులంటే....ఆరోగ్య సిబ్బంది డబ్బులేయంటారు. డబ్బులిస్తేనే పురుడు పోస్తామంటారు. ఒక్కో ప్రసూతి కేసు నుండి భారీగా వసూళ్లుచేస్తున్నారు. ఏరియా అసుపత్రిలో పెరిగిన కలెక్షన్. ప్రసూతి బాధకంటే...పైసల బాధే ఎక్కువైందంటున్న బాధితులు. బాలింతల బాధలు పటించుకునే నాధుడేలేరా అంటూ వాపోతున్నారు. కలెక్టర్ దృష్టిసారించి అదుపుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్త గూడెం ప్రధాన ఆస్పత్రిలో ఆడబిడ్డకు పురిటి గోస ఉంది. పండంటి బిడ్డను కందామని మారుమూల గిరిజన, ఆదివాసీ గ్రామాల నుండి వచ్చిన స్త్రీ మూర్తులకు పురిటి గోస నిలయంగా ఆసుపత్రి మారిందని తెలుస్తుంది. ఇందుకు నిదర్శనం గురువారం జరిగిన ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. చుంచుపల్లి మండలం, పెనగడప గ్రామానికి చెందిన శిరీష పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. అసుపత్రికి చెందిన ఆరోగ్య సిబ్బంది కనీస కనికరం చూపలేదు. సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని ఉచిత సలహా ఇచ్చారు. తీరా అక్కడి వెళ్లాక... పాల్వంచ ప్రభుత్వా సుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ పని చేయడం లేదని మళ్లీ కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి పంపించారు. వారి బాధను అదునుగా చేసుకున్న ప్రధాన ఆస్పత్రివర్గాలు ఏకంగా ప్రసూతి బేరాలకు దిగారు. నొప్పులతో బాధపడు తున్న బాధితురాలిని పట్టించుకోవడంలేదు. ప్రసూతికి చేయాలంటే రూ.13 వేలు ఇస్తే కాన్పు చేస్తామని మొండికే శారని బాధితురాలి కుటుంబ సభ్యులు లక్ష్మీ మీడియాకు తెలిపారు. చివరకు ఆరోగ్య సిబ్బందితో బేరసారాలు ఆడిం చారు. విషయం తెలుసుకున్న మీడియా రంగ ప్రవేశం చేయడంతో ఖంగుతిన్న వైద్య సిబ్బంది శిరీషకు డెలివరీ చేశారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సాటి ఆడ బిడ్డ అవస్థలు అర్థం చేసుకోక పోగా ఆసుపత్రి వర్గాలు కాసులకు కక్కుర్తి పడడం సిగ్గుచేటని జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందరో మహిళలకు ప్రతి కాన్పులో ఎదురవుతున్న (క్యాష్) కాన్పు కష్టాలే. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి వీటిని అదుపు చేయాలని మహిళలు కోరుతున్నారు.